Chardham Yatram with Swami

Guravaiah swami devote Shyamala from India says :
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః
2013 లో నేను బ్యాంక్ ఉద్యోగం మానేసి, సాఫ్టవేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, శ్రీ స్వామి వారి సేవకుడు ఒకరు ఫోన్ చేసి" శ్రీ స్వామి వారికి ఎంతో అవసరంగా 2 లక్షల రూపాయల కావాలి, ఎలా ఇవ్వగలవు నువ్వు అని అడిగాడు".నేను వెంటనే నా నగలు కుదవ పెట్టి ఇస్తాను అన్నాను.ఆ సేవకుడు అయితే వెంటనే అకౌంట్ లో డబ్బులు వెయ్యి అన్నాడు.మరుసటి రోజున నగలు కుదువ పెట్టి 2 లక్షల రూపాయలు స్వామి వారి అకౌంట్ లో వేసేసాను.
తరువాత నెల రోజులకు, శ్రీ స్వామి వారి ఆశ్రమంలో ఫంక్షనుకు నేను, నా భర్త తో కలిసి వెళ్ళాను.స్వామి వారు నన్ను పిలిచి,నాతో హిమాలయాలకు వస్తావా! యాత్రకు పోతున్నాం అన్నారు.నేను వెంటనే నాకు రావలనే వుంది నాయన, కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అన్నాను.శ్రీ స్వామి వారు వెంటనే "అవన్నీ నేను చూసుకుంటాలే నువ్వు వచ్చేయ్"అన్నారు.అయితే ఆనంద్ తో చెప్పండి అన్నాను. స్వామి వారు నా భర్తకు యాత్ర గురించి చెప్పి ఒప్పించారు.
ఈ యాత్ర గురించి నాకు చెప్పేసరికి, బదరీనాథ్ క్షేత్రం గురించి నాకు తెలియదు,ఫొటో కూడా ఎప్పుడూ చూసింది లేదు.అప్పట్లో ఒక నెల రోజుల పాటు ప్రతిరోజూ బదరీనాథ్ క్షేత్రం స్వప్నంలో వచ్చేది.తొలి 15 రోజులపాటు గుడి బయట మెట్ల పైన రాత్రంతా పడుకుని ఏడ్చినట్టు వచ్చేది, స్వామి నన్ను లోపలకి రానివ్వలేదు. 16 వ రోజు నుంచి శ్రీ లక్ష్మిదేవి అమ్మవారు సకలాలంకార భుషితురాలై ఆ మెట్ల పైన నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకొని ఒదార్చేవారు.
21వ రోజు నుండి వారం రోజుల వరకు గుడి ప్రాంగణంలో నన్ను పడుకోబెట్టుకొని ఒదార్చేవారు.చివరిగా కలలో
నేను అమ్మవారితో కలసి బదరీనాథ్ క్షేత్రంలో వున్న విష్ణుగుండంలో మూడు మునకలు వేసి నీళ్లలో నించున్నాం. ఆ నీళ్లలో నుంచి బదరీనాదుని మూర్తి పైకి లేచి అలా ఆగి కాసేపు దర్శనమిచ్చి అంతర్ధనమైనారు.
ఆ తరువాత ఆశ్రమంకు వెళ్ళినప్పుడు ఈ యాత్ర గురించి శ్రీ స్వామి వారు నాకు చెప్పడం జరిగింది.అప్పుడే నాకు అర్థమైంది శ్రీ స్వామి వారు నాకు అర్హత ముందు కలిగించి తరువాత యాత్రకు తీసుకుని వెళ్లారు అని.ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే కలలో నేను పడుకున్న మెట్లు, విష్ణు గుండం అంతా స్వప్నంలో చూసిన విధంగానే వున్నాయి. గుడిప్రాంగణంలో నన్ను లక్ష్మీదేవి పడుకోబెట్టుకొని వున్న ప్రదేశంలో శ్రీ లక్ష్మీదేవి ఆలయం వుంది.శ్రీ భద్రినాధుని దర్శనానంతరం శ్రీ స్వామి వారు అమ్మవారి గుడి ప్రక్కన గట్టుపై కూర్చున్నారు.నా స్వప్నం అంతా నిజంగా కళ్ళారా చూసిన తరువాత ఆనంద పారవశ్యంతో శ్రీ స్వామి వారి పాదాలపై తల పెట్టుకొని ఎడ్చేసాను.శ్రీ స్వామివారు నాతలపై చేయివుంచి ఆశీర్వదించారు.
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః.
*******ఈ యాత్రకు సంబంధించిన మరియొక లీల****
నా శరీరతత్వానికి చలి అస్సలు పడదు, వాహనంలో వేసే ఏసీకి ఊపిరి ఆడదు. హిమాలయాలకు వెళ్ళడం అంటే చిన్నవిషయం కాదు నాకు.ప్రాణాలతో తిరిగి వస్తానని నమ్మకం లేదు. ఒక వైపు భయం, మరో వైపు అంతటి మహాత్ముడితో తీర్థయాత్రలు చేసే సదావకాశం వదులుకోకూడదు అనే తలంపు, రెండూ వుండేవి.కానీ ప్రాణాలతో తిరిగి వస్తానని మాత్రం నమ్మకం లేదు.ఎందుకంటే ఇంట్లో మామూలుగా ఫ్యాన్ వేసినా తట్టుకోలేక కంబళ్లు కప్పుకుని పడుకునేదాన్ని.అటువంటి నాకు హిమాలయాలు దుర్భేద్యమైనవి.కారు ఏసీకి హిమాలయాలకు వెళ్ళకముందే నేను హాస్పిటల్లో చేరవలసి వుంటుంది అని ముందే నిశ్చయానికి వచ్చేసాను.
మే నెలలో శ్రీ స్వామి వారి పుట్టినరోజు తరువాతి రోజు 2 ఇన్నోవా కార్లలో మొత్తం 11మందిమి యాత్రకు బయలుదేరాం. కారు ఎక్కేముందు గుడిలోకి వెళ్ళి వెంకయ్య స్వామి పాదుకలపైన తలపెట్టి వుంచాను.వెంటనే శ్రీ వెంకయ్య స్వామి వారి మూర్తి నుంచి, పాదుకల మీదుగా మూడు నామాలు, శంకు, చక్రం నాలోనికి ప్రవేశిస్తున్నట్టు అవగతమైంది.
మనస్పూర్తిగా శ్రీ స్వామి వారి మూర్తికి నమస్కరించుకుని బయటకు వచ్చి నాయన పాదాలపై పడ్డాను.నాయన ఆశీర్వదించి ఎంకాదులే నేనున్నాను అన్నారు.
శ్రీ స్వామి వారి కరుణ ఇంత అని చెప్పడానికి వేయి నాలుకల ఆదిశేషువు కూడా సరిపోడు.కారులో ఫుల్ ఏసీ వేసినా కూడా నాకు ఏవిధమైన ఇబ్బంది కలగలేదు. హిమాలయ యాత్ర మొత్తం మీద ఒక్క యమునోత్రి లో తప్ప ఎక్కడా స్వెట్టర్ కానీ, శాలువా కానీ వాడే అవసరమే రాలేదు. నాతో పాటు వచ్చిన వారు ఏదో ఒకరకంగా అనారోగ్యం పాలు అయ్యారు, కానీ నేను మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా, నాతో వచ్చిన భక్తులకు అందరికి భోజనం చేసి పెడుతూ సంతోషంగా తిరిగి వచ్చాను.
మీరు చూపిన ప్రేమకు నా జన్మ అంతా మీ పాద సేవ చేసుకున్నా సరిపోదు నాయన !!!
ఓం నమో భగవతే శ్రీ శ్రీ శ్రీ గురవయ్య స్వామినే నమః